e-cigarette review Ping Yahoo GOSSIPS

Saturday, April 28, 2012

కృష్ణవంశీ 'పైసా' ఎలా వుంటుంది?

ఆమధ్య 'మిరపకాయ్' చిత్రాన్ని నిర్మించిన ఎల్లో ఫ్లవర్స్ అధినేత రమేష్ పుప్పాల, ప్రస్తుతం ఒకేసారి రెండు సినిమాలు నిర్మిస్తున్నారు. వీటిలో ఒకటి బాలకృష్ణ హీరోగా రవికుమార్ చావలి దర్శకత్వంలో 'శ్రీమన్నారాయణ' చిత్రం కాగా; నాని కథానాయకుడుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మరొకటి. రెండు చిత్రాల షూటింగులు ప్రస్తుతం హైదరాబాదులోనే జరుగుతున్నాయి. కృష్ణవంశీ రూపొందిస్తున్న చిత్రంలో నాని పక్కన కథానాయికగా మలయాళ భామ కేథరిన్ థెరీసా నటిస్తోంది. ఈ చిత్రానికి 'పైసా' అనే టైటిల్ ఖరారు చేశారు. ప్రస్తుత వ్యవస్థపై రూపొందించిన వ్యంగ్య కథతో కృష్ణవంశీ దీనిని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.

'మెగా'మూవీకి వినాయక్ దర్శకుడట !

చిరంజీవి తన 149 వ సినిమా పూర్తి చేసిన దగ్గరనుంచి ... ఆయన రాజకీయాల్లో చేరిన దగ్గరనుంచి 150 వ సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రాజకీయాల్లో బిజీగా ఉన్న చిరంజీవి తన 150 వ చిత్రాన్ని గురించి అప్పుడప్పుడు ప్రస్తావిస్తూ ఉండటంతో, ఆయన తిరిగి తప్పకుండా సినిమాల్లో నటిస్తారనే నమ్మకం అభిమానుల్లో కలిగింది. పార్టీకి ఉపయోగపడేలా మీరు సినిమాలు చేయండి... అంటూ ఇటీవల కాంగ్రెస్ నేత వాయిలార్ రవి సలహా ఇవ్వడంతో ఈ ప్రాజక్టు ఊపందుకుంది.
      ఇక ఆ సినిమా కథేమిటి ...?  అది రాజకీయ నేపథ్యానికి సంబంధించిన సందేశాత్మక చిత్రమా ...? అందులో అలరించే అందాల హీరోయిన్ ఎవరు ... ? అపారమైన అంచనాలతో ఉన్న ఈ సినిమాకి వి.వి.వినాయక్ దర్శకుడిగా వ్యవహరించనుండటం నిజమేనా ? ఇలా ఈ సినిమాకి సంబంధించిన అన్ని అంశాల గురించి అభిమానులు  అదేపనిగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ గాసిప్ త్వరలో నిజం కాబోతోందనే వార్తలు ఇప్పుడు మరింత వేగాన్ని పుంజుకున్నాయి.
      మెగాస్టార్ నటించనున్న సందేశాత్మక చిత్రానికి వినాయక్ దర్శకుడిగా ఖరారు అయినట్టు చెబుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన కథా చర్చల్లో తాజాగా వీరిద్దరూ పాల్గొన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ సినిమా చేస్తోన్న వినాయక్, ఆ సినిమా పూర్తి కాగానే చిరంజీవి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు చెబుతున్నారు. మరి ఈ సారైనా ఈ వార్త నిజమౌతుందో ... లేదంటే గాసిప్ గేలరీ లోనే  ఉండిపోతుందో ... !

ఐశ్వర్యకు పాపే ప్రపంచం!

మిగతా సినిమా వాళ్ల విషయం తెలియదు కానీ, ఐశ్వర్యారాయ్ మాత్రం అసలు సిసలు తల్లి అనిపించుకుంటోంది. కూతురి బాగోగులు చూడడానికి ఇంటి నిండా బంధువులు, పనిమనుషులు ఉన్నప్పటికీ... పిల్లకి స్నానం చేయించడం దగ్గర్నుంచీ, డైపర్లు మార్చడం వరకూ అన్నీ తనే చూసుకుంటోంది. పిల్లని విడిచి క్షణం కూడా ఉండలేకపోతోంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో బయటకు వెళ్ళినా ఆమె మనసంతా పిల్ల మీదే ఉంటోందట.
         ఒక విధంగా చెప్పాలంటే, పిల్ల నిద్రపోయే సమయాన్ని బట్టి తన పనులు చేసుకుంటోంది. ఇటీవల తమ మేరేజ్ డేకి స్నేహితులతో కలిసి అభిషేక్, ఐశ్వర్య ఓ రెస్టారెంట్ కి డిన్నర్ కి వెళ్లడం జరిగింది. అయితే, అక్కడ వారు ఎక్కువ సేపు గడపలేకపోయారట. కారణం... 'బేటీ బి' కి పాలు పట్టాల్సిన సమయం వచ్చేసిందట. ఆ కూర్చున్న కాసేపూ కూడా ఇష్ ముళ్ల మీద కూర్చున్నట్టే కూర్చుందట. అక్కడికీ, తమ ఇంటికి అతి సమీపంలోని రెస్టారెంట్ నే ఎంచుకున్నారట కూడా!
        ఇక గత నెలలో ఒక ఎండార్స్ మెంట్ షూటింగ్ నిమిత్తం ఐష్ దుబాయ్ వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు కూడా తన ముద్దుల చిన్నారిని తన వెంట తీసుకువెళ్ళిందట. పైగా, షూటింగు కూడా తను వున్నా హోటల్ కి దగ్గరలోనే పెట్టుకోమని చెప్పిందట. షూటింగు మధ్యలో లేచి వెళ్లి, పిల్లను చూసుకుని రావడం చేసేదట. ఇలా ఇప్పుడు ఐశ్వర్య జీవితం పిల్ల చుట్టూ తిరుగుతోంది. పిల్లే ఆమెకు ప్రపంచంలా కనిపిస్తోంది. ఆ చిన్నారి తర్వాతే ఆమెకు ఇప్పుడు ఏదైనా... అభిషేక్ అయినా సరే!

తమన్నతో కలిసి బీదర్ వెళ్లిన రామ్ ! Sat, Apr 28, 2012

రామ్ - తమన్నా జంటగా కనువిందు చేయనున్న'ఎందుకంటే ప్రేమంట' చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలోవుంది. కరుణాకరణ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా టాకీ పార్ట్ ను పూర్తి చేసుకుని, పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. కర్నాటకలోని బీదర్ లో ప్రస్తుతం నాయికా నాయకుల మధ్య ఓ పాటని చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా ఆడియో వేడుకను రేపు హైదరాబాద్ లో ప్లాన్ చేయడంతో రామ్ - తమన్నా తదితరులు హైదరాబాద్ రానున్నారు. ఈ సినిమాని అందమైన దృశ్య కావ్యంగా మలచడానికి భారీ మొత్తంలో ఖర్చు పెట్టారు. తెరపై రామ్ - తమన్నాల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందని భావించిన కుర్రకారు ప్రేక్షకులు, ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. 'కందిరీగ' సినిమాతో విజయాన్ని అందుకున్నరామ్, 'రచ్చ' సినిమాతో సక్సెస్ చూసిన తమన్నా ఈ సినిమాతో కలిసి హిట్ కొడతారో లేదో చూడాలి. 

'రూలర్'గా 'షేక్' చేయించనున్న బోయపాటి !

'దమ్ము' సినిమాతో మరోసారి తన సత్తా చాటుకున్న బోయపాటి తన స్పీడు మరింత పెంచినట్టు కనిపిస్తోంది. 'దమ్ము' తెచ్చిన టాక్ తో ఆయన మహేష్ బాబు - రామ్ చరణ్ లతో సినిమాలను చేసేందుకు మరింత ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన 'షేక్' ... 'రూలర్' అనే టైటిల్స్ ని హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు ఇమేజ్ కి తగిన కథని రెడీ చేసుకున్న బోయపాటి, ఆ సినిమాకి 'రూలర్' అనే టైటిల్ ని ఖరారు చేసుకున్నట్టు చెబుతున్నారు. 'దమ్ము' సినిమాలో 'రూలర్ ... 'అంటూ సాగే పాట ఆడియన్స్ లోకి దూసుకెళ్లింది. దాంతో తన తదుపరి సినిమాకి ఆ టైటిల్ పెట్టుకుందామని ఆ చిత్ర నిర్మాత అలెగ్జాండర్ వల్లభ అనుకున్నాడట. అయితే ఈలోగా అతనికంటే ముందుగానే ఈ టైటిల్ ని బోయపాటి రిజిస్టర్ చేయించి వల్లభకి షాక్ ఇచ్చాడని అంటున్నారు. యువతరం కథానాయకులతో వరుస హిట్లు కొట్టడానికి బోయపాటి చేస్తోన్న ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి. 

Wednesday, March 14, 2012

బాలీవుడ్ కి వెళ్తోన్న 'బిజినెస్ మేన్'

'బిజినెస్ మేన్' చిత్రం తెలుగు సినిమా బిజినెస్ ని పెంచడంలో సక్సెస్ ని సాధించింది. అప్పటికే దూకుడు మీదున్న మహేష్ బాబు ఈ సినిమా ద్వారా మరో సారి తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. ప్రపంచ స్థాయిలో విడుదలైన ఈ సినిమా, హీరోగా మహేష్ బాబుకి ...  దర్శకుడిగా పూరీ జగన్నాథ్ కి ఆ రేంజ్ క్రేజ్ నే అందించింది. ఈ సక్సెస్ తమ తదుపరి చిత్రాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని తెలిసిన మహేష్ బాబు ... పూరీ జగన్నాథ్ చాలా జాగ్రత్తగా కెరియర్ ని ప్లాన్ చేస్తున్నారు. ఇతర సినీ పరిశ్రమల పై కూడా ఈ సినిమా ప్రభావం విపరీతంగా ఉండటంతో, మహేష్ బాబుతో హిందీలో రీమేక్ చేయాలని పూరీ జగన్నాథ్ అనుకున్నారు. అందుకు మహేష్ నిరాకరించడంతో పూరీ కూడా మౌనంగా వుండిపోయారు.


అయితే ఈ నేపథ్యంలో ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయబోతున్నట్టు రామ్ గోపాల్ వర్మ చెప్పారు. ఇందుకు పూరీ జగన్నాథ్ కూడా సిద్ధంగా ఉన్నాడనీ ... అభిషేక్ బచ్చన్ ని హీరోగా ఎంచుకున్నామని అన్నారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఈ రోజు ఉదయం ఆయన ట్విట్టర్ ద్వారా తెలియ జేశారు. దాంతో మళ్లీ ఈ విషయం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిపోయిందని తెలుస్తోంది. 

గోపీచంద్ కి సాయం చేయబోతోన్నతాప్సీ

గోపీచంద్ - తాప్సీ జంటగా నటించిన 'మొగుడు' చిత్రం పరాజయం పాలైంది. 'మొగుడు' పెళ్లానికి  గొప్ప కావచ్చుగాని మాకేంటి అనుకున్నారేమోగాని ప్రేక్షకులేవరూ ఈ సినిమాని పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఇక ఈ జంట పొరపాటున కూడా తెర మీద కనిపించదని అంతా అనుకున్నారు. అయితే అలా అనుకున్న వాళ్లందరి అంచనాలు ఇప్పుడు తల్లకిందులయ్యాయి. తాజాగా వీళ్లిద్దరూ మరో మారు జట్టు కట్టేందుకు రెడీయై పోయారు.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా పతాకంపై రూపొందుతోన్న చిత్రంలో గోపీచంద్ నటిస్తోన్న సంగతి ప్రేక్షకులకి తెలుసు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెర కెక్కుతోన్న ఈ సినిమాకి కొంత మంది కథానాయికలను పరిశీలించి చివరికి తాప్సీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నిధి కోసం అన్వేషిస్తోన్న గోపీచంద్ కి కథానాయికగా తాప్సీ సాయం చేస్తూవుంటుంది. ఇక గతంలో గోపీచంద్ నటించిన 'ఒక్కడున్నాడు' చిత్రానికి చంద్రశేఖర్ ఏలేటి దర్శకుడిగా వ్యవహరించారు. దాదాపు అయిదేళ్ల గ్యాప్ తరువాత వస్తోన్న ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందోననే ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి.    
Related Posts Plugin for WordPress, Blogger...