e-cigarette review Ping Yahoo GOSSIPS: May 2011

Saturday, May 21, 2011

పొగడ్తలతో ఇబ్బందుల్లో పడ్డ తార


బాలీవుడ్ కథానాయిక కరీనాకపూర్ కి లౌక్యం తెలియదా? తెలియదనే అంటున్నారిప్పుడు. లేకపోతే అలా ఒకర్ని పొగిడితే మరొకరికి కోపం వస్తుందన్న విషయం తెలియకపోతే ఎలా? అని కూడా అంటున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, ఆమధ్య మలయాళంలో వచ్చిన 'బాడీగార్డ్' సినిమాని ప్రస్తుతం హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా చేసే ముందు అందులో హీరోయిన్ గా నటిస్తున్న కరీనాని నయనతార నటించిన మలయాళం వెర్షన్ తో బాటు, అసిన్ నటించిన తమిళ వెర్షన్ కూడా చూడమని దర్శకుడు సిద్ధిక్ సూచించాడట.
               చూశాక తన అభిప్రాయం అడిగితే, అసిన్ కన్నా నయనతార బాగా నటించిందని కరీనా కామెంట్ చేసింది. ఇప్పుడిదే పెద్ద కాంట్రావార్సీ అయి కూర్చుంది. కరీనా కామెంట్స్ విన్న అసిన్ ఇప్పుడు కరీనాపై మండిపడుతోంది. "నా నటనకి ఒకరు సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు. నేనేమిటో బాలీవుడ్ లో అందరికీ తెలుసు. ఎవరి పని వాళ్లు చేసుకుంటే బాగుంటుంది" అంటూ కరీనాకి చురకంటించింది. దీంతో, అనవసరంగా నయనతారని పొగిడి ఇబ్బందుల్లోపడ్డానే..  అని కరీనా ఇప్పుడు ఫీలవుతోందట!
 


మలేసియా వెళ్ళొచ్చిన మెగాస్టార్ మేనల్లుడు

చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ దర్శకుడు వై.వి.యస్.చౌదరి 'రేయ్' పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తొలి షెడ్యులు షూటింగ్ మార్చ్ 26 నుంచి ఏప్రిల్ 26 వరకు మలేసియాలో జరిగింది. ముఖ్యమైన సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్స్ ను కూడా అక్కడ షూట్ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చి ప్రస్తుతం హైదరాబాదులో షూటింగ్ కొనసాగిస్తున్నారు. వచ్చే నెల 10 నుంచి అమెరికాలో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
                   కథ ప్రకారం ఫస్టాఫ్ వెస్ట్ ఇండీస్ లోనూ, సెకండాఫ్ అమెరికాలోనూ జరుగుతుంది. అందుకే ఆయా ప్రాంతాలలో షూటింగ్ చేస్తున్నారు. మ్యూజికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా లవ్ స్టోరీగా రూపొందుతోందని దర్శకుడు చౌదరి చెబుతున్నారు. 'షౌట్ ఫర్ సక్సెస్' అన్నది ఈ సినిమాకి ట్యాగ్ లైన్ గా పెట్టారు. శుభ్ర అయ్యప్ప కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టు చౌదరి చెప్పారు. తమ 'బొమ్మరిల్లు వారి' బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'ఆ పట్టింపులు' లేవంటున్న ముద్దుగుమ్మ

అవసరమైతే బికినీ ధరించడానికి రెడీ... అనే స్టేట్ మెంట్ ఇస్తున్న కథానాయికలలో తాజాగా పూర్ణ కూడా చేరింది. ఇటీవల విడుదలైన 'సీమటపాకాయ్' సినిమా ద్వారా పూర్ణ కథానాయికగా పరిచయమైంది. ఈ సినిమా విజయపథంలో పయనిస్తున్న నేపథ్యంలో, గ్లామర్ విషయంలో తనకు పట్టింపులు లేవని చెపుతోంది. "గ్లామర్ లేనిదే సినిమా లేదు. అలాంటప్పుడు మడికట్టుకుని కూర్చుంటామంటే ఎలా?" అంటోంది. అన్నట్టు, కేరళ కుట్టి అశిన్ పోలికలు ఈ పూర్ణలో బాగా వుంటాయి. అందుకే అంతా ఇప్పుడీమెను అశిన్ తో పోలుస్తున్నారు కూడా. దీనికి తను తెగ సంబరపడిపోతోంది.
                  "అశిన్ లాంటి మంచి నటి, అందగత్తెతో నన్ను పోల్చడం చాలా హ్యాపీగా వుంది. అయితే, నన్ను నన్నుగానే చూడండి. సీమటపాకాయ్ తర్వాత మంచి ఆఫర్లు వస్తున్నాయి. త్వరలోనే వాటి వివరాలు చెబుతాను" అంటోంది పూర్ణ. ఒక సినిమా చేసిందో లేదో...  అప్పుడే తను తెలుగులో కూడా మాట్లాడేస్తోంది. మరో రెండు మూడు సినిమాలు చేస్తే తన డబ్బింగ్ తానే చెప్పుకుంటానని కూడా చెబుతోంది.

విజయ్ హీరోగా మణిరత్నం కమర్షియల్ సినిమా

భారీ చారిత్రాత్మక కథా చిత్ర నిర్మాణాన్ని డ్రాప్ చేసుకున్నాక దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం మూడు సబ్జెక్టులపై వర్క్ చేసున్నాడట. వీటిలో ఒకటి యాక్షన్ ప్రధానంగా సాగే కమర్షియల్ చిత్రం. ముందుగా ఈ చిత్రాన్నే డైరెక్ట్ చేయాలని మణి నిర్ణయించుకుని, ఆ ప్రకారం వర్క్ చేస్తున్నాడని కోలీవుడ్ సమాచారం. ఇందులో విజయ్ కథానాయకుడుగా నటిస్తాడని అంటున్నారు. అందుకే, హిస్టారికల్ సినిమాని డ్రాప్ చేసుకున్నాక దాని కోసం బుక్ చేసుకున్న మహేష్ బాబు, ఆర్య, అనుష్కల డేట్స్ కేన్సిల్ చేసి, విజయ్ డేట్స్ ను మాత్రం వుంచుకున్నాడు. విజయ్ కూడా కమర్షియల్ హీరో కావడంతో ప్రస్తుతం అనుకుంటున్న సబ్జెక్ట్ కి అతను సరిగ్గా సూట్ అవుతాడని మణి భావిస్తున్నాడట. 

నటనకు గుడ్ బై చెప్పనున్న మల్లూ బేబీ

ఏ భాషలోనూ కూడా సినిమాలు లేకపోవడం ఓపక్క, వయసు ముదిరిపోతూ వుండడం మరోపక్క ఇప్పుడు కేరళ కుట్టి మీరా జాస్మిన్ ని బాధిస్తోంది. దాంతో ఇక నటనకు స్వస్తి చెప్పాలని భావిస్తోందట. తమిళ డబ్బింగ్ సినిమా 'రన్' తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, ఆ తర్వాత పవన్ కల్యాణ్, రవితేజ, బాలకృష్ణ, జగపతిబాబు వంటి పెద్ద తారలతో సినిమాలు చేసినప్పటికీ, మీరాకు తెలుగులో సుడి తిరగలేదు. ఇతర భాషల్లో కూడా పరిస్థితి అలాగే ఉండడంతో ఇక నటనకు గుడ్ బై చెప్పేసి, పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడే ఆలోచనలో వున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తను ప్రముఖ మాండిలిన్ విద్వాంసుడు మాండిలిన్ శ్రీనివాస్ సోదరుడు రాజేష్ ప్రేమలో పడింది.  త్వరలో అతనిని వివాహం చేసుకుంటుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

'వీడు తేడా' అంటున్న నిఖిల్

నిఖిల్, పూజా బోస్ జంటగా చిన్నికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'వీడు తేడా'. లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రకాష్, కళ్యాణ్ చక్రవర్తి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారులోని  మణికొండలో జరుగుతోంది. నిఖిల్ గతి చిత్రాలకు భిన్నంగా ఉండే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని దర్శకుడు చిన్నికృష్ణ చెబుతున్నారు. చక్రి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా ఆడియోను జూన్ నెలాఖరులో విడుదల చేయనున్నారు. 'కొత్త బంగారులోకం', 'అదుర్స్' చిత్రాల్లో వచ్చీరాని ఇంగ్లీషు మాట్లాడుతూ అలరించిన ఆర్టిస్టే ఈ చిత్ర దర్శకుడు! దీనిని జులైలో రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్నారు. 'కళవర్ కింగ్', 'ఆలస్యం...అమృతం' చిత్రాలతో వరుస పరాజయాలు చవి చూస్తున్న నిఖిల్, ఈ సినిమా మీదే ఇప్పుడు ఆశలన్నీ పెట్టుకున్నాడు!

విక్రం, అనుష్కల సినిమా 'నాన్న'


అందాల అనుష్క తాజాగా నటించిన తమిళ చిత్రం 'దైవ తిరుమగన్'. ఇందులో విక్రం కథానాయకుడిగా నటించాడు. దీనిని 'నాన్న' పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రం వికలాంగుడి పాత్రలో అద్బుతంగా నటించాడంటున్నారు. ఇందులో అనుష్క లాయర్ పాత్ర పోషించింది. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా విక్రం కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని టాక్. ఈ సినిమా ఆడియోను రేపు (మే 21) హైదరాబాదులోని ప్రసాద్ లాబ్స్ లో రిలీజ్ చేస్తున్నారు. శివపుత్రుడు, అపరిచితుడు....  చిత్రాల స్థాయిలో 'నాన్న' సినిమా కూడా హిట్ అవుతుందేమో చూడాలి!
 


హిందీలో రీమేక్ కానున్న మరో తెలుగు చిత్రం

ప్రభాస్ కథానాయకుడిగా దిల్ రాజ్ నిర్మించిన 'మిస్టర్ పెర్ ఫెక్ట్' సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో, ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం బాలీవుడ్ రీమేక్ హక్కులను తాజాగా ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి హిందీలో ఎవరు దర్శకత్వం వహిస్తారన్నది ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ, దర్శకుడు అనీజ్ బజ్మీతో సాజిద్ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. గతంలో పలు ప్రాంతీయ భాషా చిత్రాలను హిందీలోకి రీమేక్ చేసిన అనుభవం అనీజ్ కు వుంది. ఏది ఏమైనా, ఇటీవలి కాలంలో పోకిరీ, కిక్, రెడీ, విక్రమార్కుడు... వంటి పలు తెలుగు చిత్రాలు హిందీలోకి రీమేక్ అయ్యాయి. ఇప్పుడు 'మిస్టర్ పెర్ ఫెక్ట్' కూడా ఆ కోవలో చేరుతోంది.

ఈరోజు యన్టీఆర్ 'స్పెషల్ బర్త్ డే'!

సింహం కడుపున సింహమే పుడుతుంది... పులి కడుపున పులే పుడుతుంది... నటుడి వంశంలో నటులే పుడతారు. అందుకు జూనియర్ యన్టీఆర్ నిలువెత్తు నిదర్శనం. మహానటుడు యన్టీఆర్ కి... తాతకు తగ్గా మనవడిగా రాణిస్తున్న ఈ యువకిశోరం జన్మదినం నేడు. అయితే, నేటి పుట్టిన రోజుకి ఓ ప్రత్యేకత వుంది. లక్ష్మీ ప్రణతిని ఇటీవలే మనువాడి ఓ ఇంటివాడైన యన్టీఆర్ జంటగా జరుపుకుంటున్న జన్మదినం ఇది. అమ్మానాన్నలతో బాటు అర్ధాంగి, అత్తామామలు తోడుగా జరుపుకుంటున్న తొలి వేడుక ఇది. వీరందరి సమక్షంలో నేడు ఈ యంగ్ టైగర్ బర్త్ డే కేక్ ను కట్ చేస్తున్నాడు.
                   కెరీర్ పరంగా యన్టీఆర్ వయసు కేవలం పదేళ్లు. ఇంతవరకు చేసిన సినిమాలు జస్ట్ పందొమ్మిది. అయితే సంపాదించుకున్న ఇమేజ్ మాత్రం అంతాఇంతా కాదు... వంద సినిమాల ఇమేజ్! ఈ ఇమేజ్, ఫాలోయింగ్ ఈ నందమూరి అందగాడికి అంత ఈజీగా వచ్చేసింది కాదు. ఇంటి పేరు, తాత రూపు ఇనిషియాల్ గా ఓ ఫ్లాట్ ఫారాన్ని ఏర్పరిస్తే... మిగతాదంతా అతని కష్టార్జితం. డ్యాన్సుల్లో గానీ, యాక్షన్ సీన్స్ లో కానీ అతను పడే కష్టం, తపన, తాపత్రయం అతన్నీవేళ ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఆ కష్టమే అతనికి శ్రీరామరక్షగా నిలుస్తుంది. ముందు ముందు మరిన్ని విజయాలకు తోడ్కునిపోతుంది.
                   ఈ జన్మదినం శుభ సందర్భంగా యన్టీఆర్ కు ap7am.com మెనీ హ్యాపీ రిటర్న్స్ చెబుతోంది. 
Related Posts Plugin for WordPress, Blogger...