ఆమధ్య 'మిరపకాయ్' చిత్రాన్ని నిర్మించిన ఎల్లో ఫ్లవర్స్ అధినేత రమేష్ పుప్పాల, ప్రస్తుతం ఒకేసారి రెండు సినిమాలు నిర్మిస్తున్నారు. వీటిలో ఒకటి బాలకృష్ణ హీరోగా రవికుమార్ చావలి దర్శకత్వంలో 'శ్రీమన్నారాయణ' చిత్రం కాగా; నాని కథానాయకుడుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మరొకటి. రెండు చిత్రాల షూటింగులు ప్రస్తుతం హైదరాబాదులోనే జరుగుతున్నాయి. కృష్ణవంశీ రూపొందిస్తున్న చిత్రంలో నాని పక్కన కథానాయికగా మలయాళ భామ కేథరిన్ థెరీసా నటిస్తోంది. ఈ చిత్రానికి 'పైసా' అనే టైటిల్ ఖరారు చేశారు. ప్రస్తుత వ్యవస్థపై రూపొందించిన వ్యంగ్య కథతో కృష్ణవంశీ దీనిని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.
Good website like https://www.wisdommaterials.com/index.html
ReplyDelete